పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యుల పాలిట పిడుగుపాటు...విశ్వాస ఘాతుకం: సీఎం రేవంత్ రెడ్డి
ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధాన్ని సాకుగా చూపి పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచడం సామాన్యుల నడ్డి విరచడమే. ప్రపంచంలో భారత్ ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపామని ఘనంగా ప్రకటించుకుంటున్న మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఎలా సమర్థించుకుంటుంది!?’అని ప్రధాని నరేంద్రమోడీ నిలదీశారు.

దేశంలో పెట్రోల్,డీజిల్ ధరల పెంపుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేశారు.పెట్రోలియం ఉత్పత్తుల ధరలను పెంచం అని ఎన్నికలకు ముందు పదేపదే ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ఫలితాలు వెలువడిన పది రోజుల్లోనే పెంచడం ప్రజల నమ్మకాన్ని వంచించడమే అని అభిప్రాయపడ్డారు. రూ.3కు పైగా పెట్రోల్,డీజిల్ ధరలు పెంచడంవిశ్వాస ఘాతుకం అని అభిప్రాయపడ్డారు. ఇకనైనా ప్రధాని నరేంద్రమోడీ పెట్రోల్,డీజిల్ ధరల పెంపును ఉపసంహరించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
మోడీ అసమర్థ పాలన వల్లే ఈ దుస్థితి
‘ప్రధాని నరేంద్రమోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయం ఏ మాత్రం సమర్థనీయం కాదు. ఈ నిర్ణయం అనేక రంగాల పై వ్యతిరేక ప్రభావం చూపుతుంది. నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుల పాలిట పిడుగుపాటు అవుతుంది’అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత విధానాల కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ కుదేలైంది. ఆత్మ నిర్భర్ కేవలం ఓట్లు రాల్చే నినాదమే తప్ప… ఫలితాలు తెచ్చిన పాలసీ కాదు అన్నది తేలిపోయింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయి. యువత ఉపాధికి గ్యారెంటీ లేని పరిస్థితి దాపురించింది. రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామన్న హామీ ఒట్టి మాటగా మిగిలింది. గత పదేళ్లుగా రూపాయి విలువ పతనమవుతూ వస్తోంది. ఇప్పుడు ఆ పతనం పరాకాష్ఠకు చేరింది’అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
యుద్ధాన్ని సాకుగా చూపించి రేట్లు పెంచడం సరికాదు





